అమరావతే ఏకైక రాజధాని: 94శాతం మద్దతు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో రైతులు, మహిళల నిరసనలు 253వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ తెదేపా తీసుకొచ్చిన www.apwithamaravati.com వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

ఇప్పటి వరకు వెబ్‌సైట్‌లో 3,18,660 మంది ఓట్లు వేశారు. అమరావతే ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు 94 శాతం మంది మద్దతు తెలిపారు.

Comments (0)
Add Comment