శివ మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

కొమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం శివ మల్లన్న ఆలయంలో కార్తీకమాసం చతుర్దశిని పురస్కరించుకొని భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 20 సంవత్సరాల క్రితం కర్ల నానయ్య, గోవిందుల సురేష్ గారి ఆధ్వర్యంలో కార్తీక మాసం చతుర్దశి రోజున లక్ష వత్తులతో 100 అఖండ జ్యోతులు, 500 దీపాలను వెలిగించడం ప్రారంభించారు. ఈ సంవత్సరం కర్ల నానయ్య, పోతురాజుల బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు కలిసి చతుర్దశిఇ పుర్ష్కరించుకుని జ్యోతులు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ ఇందారపు రాజేశ్వర్ మరియు పెండ్యాల వామన్ గారు (ఈవో),భక్తులు పాల్గొన్నారు..అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్..

Comments (0)
Add Comment