రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

ఇటీవల నంగునూర్ మండలం నర్మెట నుండి సిద్దిపేట పట్టణానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన సీనియర్ జర్నలిస్ట్, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కూతరు రాజిరెడ్డి ని మంత్రి హరీష్ రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. నేను ఉన్న రాజన్న అంటూ ఆత్మీయంగా మాట్లాడి భరోసానిచ్చారు. ఆరోగ్యం జాగ్రత్త ఇబ్బంది పడవద్దు అంటూ బరోసా కల్పించారు. మంత్రి వెంట జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి ఉన్నారు….తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment