భారత మానవ హక్కుల మండలి నూతన రాష్ట్ర కమిటీ మరియు మండల కమిటీ ఎన్నిక

సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఇనపనూరి నవీన్, తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దిశెట్టి సామేలు హాజరై మాట్లాడుతూ ది.18.12.2020 న ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో భారత మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో జరగనున్న సదస్సును జయప్రదం చేసే క్రమంలో నూతన కమిటీని నియమించడం జరుగుతుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నారపోగు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీగా కోకొప్పు లాజరస్ మరియు వెంసూరు మండల అధ్యక్షులుగా రావూరి నాగేశ్వరరావు, తల్లాడ మండల అధ్యక్షులు గా తేళ్ళురి రఘును నియమిస్తూ, ఈనెల 18వ తారీకు న జరిగే సదస్సును జయప్రదం చేయడం కోసం అడక్ కమిటీని నియమించడం జరిగింది.

జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం.
 
Comments (0)
Add Comment