భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

కృష్ణా జిల్లా తిరువూరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ బబ్బూరి శ్రీరామ్ గారు వచ్చి యున్నారు ,ఈ సందర్భంగా శ్రీ రామ్ గారు మాట్లాడుతూ ఇప్పుడే గ్రామ స్తాయినుంది మండల స్థాయి వరకు కమిటీలను నియమిస్తున్నాము ,రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని ,ప్రస్తుత ఉన్న నియోజక వర్గ కార్యాలయానికి ఇంచార్జి లేకపోవడంతో నూతనంగా,పార్టీ కార్యాలయానికి ఇన్ఛార్జిగా ,పార్టీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ ధారా మాధవరావు గారిని నియమిస్తూ నియామక పత్రాన్ని పార్టీ కార్యకర్తల సమక్షంలో అందజేశారు ,ఈ కార్యక్రమంలో ,పార్టీ రాష్ట్ర నాయకులు డా,,ఉమ మహేశ్వరావు గారు,ధారా మాధవరావు ,దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ,గుత్తా శివ సుబ్రమణ్యం ,తొర్లపాటి వెంకయేశ్వరరావు (చంటి),అన్నవరపు క్రాంతి కుమార్ ,చావల కృష్ణా ,సి హెచ్ దివాకర్ ,బండి అచ్యుతరావు,రమణ ,శ్రీనివాస చారి,రాఘవ ఒరుగంటి,గోపి మొదలగు వారు పాల్గొన్నారు.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment