పోలవరం పనులు పరిశీలించిన ప్రాజెక్టు అథారిటీ

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిశీలించింది. తొలుత ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృందానికి ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్యులు ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే క్రస్ట్‌ గేట్ల అమరిక పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇంజినీర్లు పీపీఏ బృందానికి వివరించారు. పీపీఏ బృందం మరో రెండు రోజులపాటు పోలవరంలో పర్యటించి వివిధ అంశాలపై పరిశీలన జరపనుంది.

 

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment