దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఎస్ ఐ కి విన్నతి పత్రం అందచేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని కలచట్ల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలోఫర్ మరియు ఉపాధ్యాయురాలు శాంతి ప్రియ గార్ల పైన అదే గ్రామంలోని నాగేంద్ర అనే వ్యక్తి మద్యం సేవించి నాడు నేడు పనులకు సంబంధించి వచ్చిన నిధుల్లో తనకు కూడా వాటా ఇవ్వాలి అని,లేని పక్షంలో మీ అంతు చూస్తా అని ఉపాధ్యాయుల పైన బెదిరింపులకు పాల్పడడం జరిగిందని,గతంలో కూడా ఇదే వ్యక్తి సదరు ప్రధానోపాధ్యాయుల పైన దాడికి పాల్పడటం జరిగిందని ఇటువంటి సంఘటనలు ఏ పాఠశాలలో కూడా పునరావృతం కాకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు యస్ ఐ మారుతి శంకర్ కి వినతిపత్రం అందచేశారు..ఈ కార్యక్రమంలో శివన్న,అల్లిపిరా, గణేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment