తాడివలస ఉన్నత పాఠశాలను సందర్శించిన డైట్ సిబ్బంది

తాడివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డైట్ లెక్చరర్ జి. వి. రమణ ఈరోజు సందర్శించారు. ఆరవ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలపై ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఫార్మట్ రూపంలో సేకరించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందజేసిన జగనన్న విద్యాకానుకు సంబంధించిన వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లఖినాన హేమనాచార్యులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.గురుగుబెల్లి వెంకటరావు,
ప్రజానేత్ర – రిపోర్టర్.

Comments (0)
Add Comment