చింతవర్రె గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించిన : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీ చింతవర్రె గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వర రావు గారు. బాధితుల ఉద్దేశించి ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలనీ, ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వనమా, ఎమ్మెల్యే వనమా వెంట రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే హనుమంతరావు, ఎంపీపీ భూక్యా సోనా, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు, బాధిత కుటుంబాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment