ఘనంగా  వాజ్‌‌పేయి జయంతి  వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భారతీయ జనతాపార్టీ భద్రాచలం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్ నందు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాజ్పేయి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో దేశం కోసం పాటు పడాలి అన్నారు అదే మనం వాజ్పేయి కి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు 1962లో నాటి వైఫల్యాలను ఖండిస్తూ ప్రభుత్వాన్ని నిర్మొహమాటంగా నిలదీసిన వ్యక్తి వాజ్పేయి అన్నారు వాజ్పేయి ప్రధాని అయిన తర్వాత పోక్రాన్ అను పరీక్షలు నిర్వహించి ప్రపంచపు దేశాలను నివ్వెరపరిచే విధంగా చేశారని అన్నారు కార్గిల్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే భారత సైన్యం తరిమికొట్టే లా చేసిన ఘనత వాజ్పాయ్ దే అన్నారు దేశం కోసం నిత్యం పాటుపడుతూ భారతదేశం అభివృద్ధి చెందాలని ఆశించే వారు అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షుడు ములిశెట్టి రామ్మోహన్ రావు జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ రావు దేవరపల్లి వెంకటేశ్వరరావు కొనిజర్ల ముక్తేశ్వరరావు మండల కార్యదర్శి సుధాకర్ రావు సీనియర్ నాయకులు మారేవాళ్ళు సుబ్బారావు పి సి కేశవ్ ముక్కెర కోటేశ్వరి రామకృష్ణ రాజు ఏబీవీపీ నాయకులు ములిశెట్టి నిఖిల్ దళిత మోర్చా మండల అధ్యక్షుడు క్రాంతి బాబు బూత్ అధ్యక్షులు సత్యనారాయణ ప్రసాద్ మురారి బాబు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment