క్రీడలతోనే మానసిక ఉత్తేజం

లావేరు మండలం లోని, చిన్న మురపాక గ్రామం లో.. రెండున్నర సంవత్సరాల క్రితం మరణించిన మిత్రుడు గంట్యాడ రమేష్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిదిగా లావేరు మండల SI D. విజయ్ కుమార్ గారిని లావేరు మండల నాయకులు లంకలపల్లి గోపి గారు ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉత్తేజం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జరగనున్న ప్రారంభ మ్యాచ్ కు నిర్వాహకులు SI గారిని ఆహ్వానించారు. ఇప్పటివరకు 60 క్రికెట్ టీం లు తమను సంప్రదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. చిన్ని ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment