కైరుప్పల హమాలీ సంఘం ఆధ్వర్యంలో బేగారి నరసన్న కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం

ఆస్పరి కైరుప్పల గ్రామానికి చెందిన బేగారి నరసన్న అమాలి కార్మికుడు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన నరసన్న కుటుంబానికి కైరుప్పల హమాలీ సంఘం తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, ఏఐటీయూసీ తాలూక కార్యదర్శి మునిస్వామి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడి వీరేశ్ చేతులమీదుగా నరసన్న కుమారునికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది.,వారు మాట్లాడుతూ కైరుప్పల గ్రామం లో బేగారి నరసన్న హమాలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారని ఇప్పుడు ఆయన మరణించడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బేగారి నరసన్న కు ప్రభుత్వం నుంచి వర్తించే అన్ని పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సురేషు శ్రీనివాసులు, శ్రీనివాసులు, పరమేశు వీరేశ లింగన్న వెంకటేశు ఉరుకుందు జానకి రాముడు పెద్ద పరశురాముడు, మచ్చన్న, శ్రీ రాము రఘు, వీర బద్రి, రంగన్న, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment