కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించిన సుబ్బు యాదవ్

కర్నూల్ జిల్లా ప్యాపిలి కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్యాపిలి మండలం వెంకటానిపల్లి గ్రామములో జిల్లా ప్రధానకార్యదర్శి మోరిమిశెట్టి సునీత, కాంగ్రెస్ పార్టీ ప్యాపిలి మండల అద్యక్షులు ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్, శేషయ్య ఆధ్వర్యములో కాంగ్రెస్ నాయకులు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తరువాత కలచట్ల గ్రామములో వికలాంగుడు మహేంద్ర యాదవ్ కు మండల అద్యక్షులు ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్ గారు 1000 రూపాయలు నగదు రూపములో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగధనుల పార్టీ అని దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం దేశానికి ఎంత ఉందని, కులమతాలకు అతీతంగా పరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.తిరుమల్ ,ఎన్ రామకృష్ణ,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
?ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment