ఆయుర్వేద వైద్యం గిడ్డయ్య 5 వ వర్ధంతి వేడుకలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో స్థానిక గ్రంథాలయం నందు రైతు మరియు ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ సుదనపల్లి వైద్యం 5వ వర్ధంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమము నందు రైతులను ఘనంగా సన్మానించి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా అల్లుడు పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి,అల్లుగుండు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్, పెన్నులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు వైద్యం విద్య ఫౌండేషన్ అధ్యక్షులు రామ నాయుడు రామాంజనేయులు మరియు హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు నరసింహ నాయుడు గ్రంథాలయ అధికారి కవితా బాయ్ రైతు నాయకులు ఈశ్వర్ హోలీయ దాసరి సంఘం అధ్యక్షులు టీజీ వెంకటేష్ మరియు రైతులు, సామాజికవేత్త ఉస్మాన్ భాష, యువరైతు సూర్య పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment