అంబేద్కర్ కు ఘన నివాళి..

శ్రీకాకుళం జిల్లా,  అంబేద్కర్ కు ఘన నివాళి..రణస్థలం, అంబేద్కర్ ఆశయ సాధన ఆయనకు నిజమైన నివాళ్ళని ప్రముఖ వ్యాపారవేత్త పిన్నింటి వెంకట బానోvజినాయుడు పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రణస్థలం పంచాయితీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో రణస్థలం అంబేద్కర్ యువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రణస్థలం పంచాయితీ లో సేవా పౌండేషన్ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని జె.ఆర్.పురం సిఐ వి.చంద్రశేఖర్ ప్రారంబించారు. ఈ రక్తదాన శిబిరంలో పిన్నింటి బానోజినాయుడు, గ్రామ యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఇడదాసుల తిరుపతిరాజు, మజ్జి రమేష్, కెల్ల హేమంత్, కె.ఆర్.రమణ, ప్రసాద్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment